Friday, September 5, 2014

ఉపాధ్యాయ దినోత్సవం - విద్యార్ధులతో దేశ ప్రధాని మాటా మంతి

ఈ రోజు భారత దేశ చరిత్రలో మొదటి సారి ఒక ప్రధాని దేశ వ్యాప్తంగా ఉన్న భావి భారత పౌరులను ( విద్యార్ధులను) ఇంటరాక్టివ్ పద్ధతిలో సంభాషించటం నిజంగా అభినందనీయం . ఇది భావి భారత పౌరులను ఎంతగానో  ప్రభావితం చేస్తుంది మరియు వాళ్లలో ఎంతో ఉత్తేజాన్ని నింపుతుందనడం సందేహం లేదు.  మన దేశ ప్రధాని ని దాదాపుగా ముఖతః మాట్లాడం ప్రశ్నించగలగడం మన so called Democracy లో నిజంగా ఒక కలే.  మన నాయకులు ఎన్నికయే వరకు అరచేతిలో స్వర్గాన్ని   ఆ తరువాత చుక్కల్ని చూపిస్తారు.   పిల్లల్లో నేను మన దేశ ప్రధానితో మట్త్లాడాను అనే భావన ఎంతటి ఉత్సుకత నింపుతుందో వర్ణనాతీతం .  మోదీ జీ ఎన్నికల ముందే కాదు ఎన్నికలై ప్రభుత్వాన్ని ఎర్పరిచిన తరువాత కూడా ప్రజలతో మమేక మవడాని కి చేస్తున్న ప్రయత్నం నిజంగా అభినందనీయం .

అంతే కాదు ఆయన ప్రసంగంలో అతి ముఖ్యమైన మరియు అత్యావశ్యక అంశాన్నికూడా ప్రస్తావించారు.    అదే నేటి తరంలో  ఉపాధ్యాయ వృత్తి మీద ఉన్న అనాసక్తి ని ఎత్తి చూపారు.  మరి మోదీ గారు ఉపాధ్యాయ వృత్తి మీద నేటి యువత కు అసక్తి కలగడానికి ఎమైనా చర్యలు చేపడ తారేమో చూడాలి.  ఉపాధ్యాయ వృత్తి మీద సమాజానికి ఉన్న దృక్ఫదం మారాలి.   ప్రతీ దానిని డబ్బుతో బేరీజు వేసే సంస్కృతి పోవాలి.    తమ జ్ఞానాన్ని పది మందికి పంచే పవిత్ర అధ్యాపక వృత్తి ని చేపట్టేలా నేటి తరాన్ని ప్రోత్సవాించాలి. 

No comments:

Post a Comment