Friday, June 22, 2012

సిగ్గు సిగ్గు ...

సిగ్గు సిగ్గు ...

భారత టెన్నిస్ సమాఖ్య లండన్ లో జరిగే ఒలింపిక్స్ కు రెండు జట్లు మహేష్ మరియు బోపన్న, పేస్ మరియు విష్ణు వర్ధన్ లను  ఎంపిక చేసి తమ చేత కానీ తనాన్ని బయట పెట్టుకుంది.  పేస్ తో జతకట్టేది లేదని మొండికేసిన మహేష్ మరియు బోపన్న ల మీద క్రమశిక్షణ చర్య కూడా తీసుకోలేని స్థితి లో వున్నాము అని బహిరంగంగానే ఒప్పుకున్నారు.   అలా ప్రకటించి దేశ ప్రతిష్టను అంతర్జాతీయంగా దిగజార్చారు.  దేశ ప్రయోజనాలు గాలికి వదిలేసారు.  బోర్డులను క్రీడాకారులు శాసించే స్థితిలో వున్నారు అంటే అర్ధం చేసుకోవచ్చు మన వ్యవస్థలు ఎంత  దిగజరిపోయయో.   దేశ ప్రయోజనాలకన్న తన ఈగో నే  ముఖ్యమనుకుని తను చెడింది కాకా వర్ధమాన క్రీడ కరుడిని సహితం చెడగొట్టిన మహేష్ క్షమార్హుడు కాదు మరియు చరిత్ర హినుడిగా మిగిలి పోతాడు.  తన స్వ ప్రయోజనాలకే పెద్ద పీట వేసిన మహేష్ అసలు  క్రీడ కారుడే కాదు.  డర్టీ ......  

Saturday, June 16, 2012

ప్రజాస్వామ్యమా? లేక మతస్వామ్యమా ?

హైదరాబాదు నగరంలో ఒక పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్న లేడి హోం గార్డ్ తన విధులకు స్టేషన్ లో మరియు బందోబస్తు విధులకు కూడా  నేను బురఖా వేసుకుంటాను అనుమతినిమ్మని ఆడిగితే చిత్తం మీకు  నచ్చినట్లుగా నే చేయండి అని అనుమతినిచ్చారుట పోలీసు బాసులు.  

Thursday, June 14, 2012

తల పండిన వయసులో లింగ మార్పిడి ఆపరేషన్ ?

చైనా లో క్వియన్ జిన్ఫాన్ అనే  84  సంవత్సరాల వృద్ధుడు స్త్రీ గ మారేందుకు లింగ మార్పిడి చేయించుకో వలని అభిలషిస్తున్నాడు. గత నాలుగు సంవత్సరాలుగా అతను వక్ష సంపద పెరుగుదల కోసం  హార్మోన్ల ఇంజెక్ష నలు కూడా తీసుకుంటున్నాడు మరియు స్త్రీ ల వస్త్ర ధారణ ను అనుకరిస్తున్నాడు.  అతనికి పెళ్లి అయి ఒక కుమారుడు కూడా ఉన్నాడు.  తనకి చిన్నతనం నుంచి అమ్మాయిలాగా వుండట మంటే చాల ఇష్టమని తనకు తానుగా మహిళా గ పేరు మార్చుకున్న అతడు నాలుగు సంవత్సరముల క్రితం తన రహస్య కోరికను వెల్లడి చేసాడు.   తన 14 వ ఏట నుంచి ఆడవారిలాగా నడవాలని వుండేది కానీ నేను ఒంటరిగా ఉన్నపుడు మాత్రమే అల చేసే వాడిని అని "నన్ఫంగ్" అను దిన పత్రిక కు తెలిపాడు.  వ్రుత్తి రీత్యా కలిగ్రాఫెర్ అయిన అతడు ఇంత కాలం తనలో ని ఈ కోరికను  తన తల్లి తండ్రులకు, భార్య కు కుమారినికి తెలియకుండా జాగ్రత్త పడ్డాడు. 

Tuesday, June 12, 2012

ఇదేనా ప్రజాస్వామ్యం ?


ఉత్తర ప్రదేశ్ లోని కన్నౌజి లోక్ సభ స్తానానికి అ రాష్ట్ర ముఖ్య మంత్రి అఖిలేష్  భార్య డింపుల్  ఏక గ్రివంగా ఎన్నికైనట్లు ప్రకటించారు. ప్రజా స్వామ్యం అంటే  ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకో బడడమే అని నిర్వచనం ?  మరి డింపుల్  యాదవ్ ఎన్నికలో ప్రజల ప్రమేయం ఏముంది.  నిజంగా అ రాష్ట్ర ము లోని పార్టిలు ప్రధాన ప్రతి పక్షము మరియు జాతీయ పార్టీలతో సహా అభ్యర్ధిని నిలబెట్టక పోవడం సిగ్గుచేటు.  దేశం లోని రాజకీయ నాయకులందరూ ప్రాంతాల వారిగా పంచుకుంటూ ప్రజా ధనాన్ని దోచుకుంటున్నారు అనడానికి ఇది ప్రత్యక్ష నిదర్శనం.  ఇక్కడ అధికారమే ఆయుధం అని విస్పష్టంగా తెలుస్తోంది.  ఆమె 2009 లో జరిగిన  లోక్ సభ ఎన్నికలలో పోటి చేసి ఓటమి పాలయింది.  ఇప్పుడు వాళ్ళాయన ముఖ్యమంత్రి కావడం తో ఇల్లాలి ముచ్చట ని ప్రజాస్వామ్యాన్ని పణంగా పెట్టి తీర్చాడు.

Monday, June 11, 2012

ప్రపంచ ప్రఖ్యాతి కలిగిన నోబెల్ బహుమతి ప్రైజ్ మని తగ్గింపు.

విజ్ఞాన శాస్త్రము, సాహిత్యము మరియు శాంతి రంగాలలో ప్రతి సంవత్సరము ఇచ్చే నోబెల్ బహుమతి విలువను అయిదవ వంతు కు తగ్గించి నట్లుగా నోబెల్ ఫౌండేషన్ తెలిపింది.  డైనమైట్ ను కనుగొన్న అల్ఫ్రెడ్ నోబెల్ చే సమకుర్చబడిన మూలధనం తో 1900 వ సంవత్సరము లో  ఏర్పాటు చేయబడిన ఫౌండేషన్   ప్రతియేటా వివిధ  రంగాలలో అసమాన్య ప్రతిభ కనపరచిన వారికి నోబెల్ బహుమతి ప్రకటిస్తూ వుంది.  గడచిన దశాబ్ద కాలంగా ఖర్చులు మూలధనం మీద వచ్చే వడ్డీ కన్నా అధికమవడం మరియు నిర్వహణ భారం కూడా పెరిగిపోవడంతో ప్రైజ్ మనీ ని 10 మిలియన్ క్రౌన్ ల నుంచి 1 .12  మిలియన్ క్రౌన్ లకు తగ్గించారు.

Tuesday, June 5, 2012

డీజిల్ లేదా గాస్ తో నడిచే బైక్స్ ?

పెట్రొల్ ధరలు ప్రభుత్వ నియంత్రణ లేమి కారణంగా రోజు రోజు కూ పెరిగిపోతున్నాయి.  ఈ మధ్య కాలంలో  డీజిల్ లేదా గాస్ తో నడిచే కార్ల అమ్మకాలు పెరుగుతున్నాయి. మరి డీజిల్ లేదా గాస్ తో నడిచే బైక్స్ ఎందుకు రావట్లేదు?  కారణం ఏమిటి? టెక్నాలజీ సమస్య లేక ఫైనన్సియల్ వయబిలిటీ లేకపోవడమా?

Saturday, June 2, 2012

ఈ క్రింది పోస్ట్ మీద నాస్పందన.
వాల్లు ఏడుస్తుంటే

మొదటగా వాళ్ళ ఏడుపుకు కారణం స్వయంక్రుతాపరాధం.  అధికారాన్ని అడ్డుగా పెట్టుకుని కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని కొల్ల గొట్టారు.  దానికి ఫలితం అనుభవిస్తున్నారు.

ఇక రాజశేఖర్ రెడ్డిగారు ప్రవేశ పెట్టిన అన్ని schemes ప్రజలకు తాత్కాలిక ప్రయోజనాలను మాత్రమే కలుగ జేస్తాయి, అవి కూడా కొద్ది మంది కి మాత్రమే.  ఆ schemes క్రింద పెట్టిన ఖర్చు వలన private వ్యక్తులు (corporate) మాత్రం బాగా లాభ పడ్డారు.  చాలామంది అర్హత లేని వ్యక్తులు అక్రమ రేషన్ కార్డులు, దొడ్డి దారిలో అవసరమున్న లేకున్నా పధకాల ముసుగులో దోచుకున్నారు.  ఆ సొమ్మును దీర్ఘకాలంగా ప్రయొజనలను ఇచ్చే కళాశాలలు, ఆసుపత్రులు మొదలయిన infrastructure మీద ఖర్చు చేసి వుంటే  వాటి ఫలాలు కొన్ని తరాలు వారు అనుభవించే వారు.  నిజంగా అభివ్రుధ్ధి ఆంటే అది, అంతే కాని ఓట్ల కోసం, తన స్వప్రొయొజనాల కోసం ప్రజల కష్టార్జితాన్ని నీళ్ళ పాలు చేయడం కాదు.  అటువంటి వాల్లు మనకు నాయకులు.  దయచేసి మీ అజ్నానాన్ని వీడండి.  వాల్లు schemes పేరుతో మనల్ని దోచుకుంటున్నారు, వాస్తవాన్ని గ్రహించండి.  చివరగా ఒక్క మాట, ఫలనా వ్యక్తి నిర్మించిన కాలేజీ ఇది అని కొన్ని దశాబ్దాల తరువాత కూడా జనం చెప్పుకుంటారు అంటే చూడండి, అది మనకు తరతరాలు చేకూర్చే ప్రయొజనం.