Saturday, November 29, 2014

ఒక మంచి ఆప్ - పెడోమీటర్

ఆప్స్ ఆప్స్ స్మార్ట్ ఫోన్ ల యుగంలో ఆప్స్ అందరికీ చేరువయి పోయాయి.  నిజంగా అప్స్ మనదినసరి కార్యక్రమాల నిర్వవాణను చాలా సులభతరం చేసిందనడంలో ఎటువంటి సందేహం లేదు.  ఆండ్రాయిడ్ శకం మొదలయ్యాక అప్స్ మన జీవితంలోకి చొచ్చుకుని వచ్చేశాయి.  ఇప్పుడు లెక్కలేనన్ని ఆప్స్ అందుబాటులో ఉన్నయి.  మన ప్రతీ అవసరానికీ ఒక ఆప్ ఉందనడం లో ఆనుమానం  లేదు.  నేను కొత్తగా పెడోమీటర్ అనే  అప్ ను నా స్మార్ట్ ఫోన్లో ఇన్ స్టాల్ చేసుకున్నాను.  ఇది రోజు మనం ఎంత దూరం నడుస్తున్నాం అనే విషయాన్ని నమోదు చేస్తుంది.  అంతే కాకుండా ఎంత వేగంతో నడుస్తున్నాం, ఎన్ని కాలరీలు ఖర్చు అయ్యాయి, ఎంత సేపు నడిచాం మొదలయిన వివరాలు తేది, వారం మరియు నెల వారీగా నమోదు చేస్తుంది మరియు చూపుతుంది.   వ్యాయామంగా నడక చేసే వారికి ఇది ఎంతో ఉపయోగకరం .   మీరు ప్రయత్నించి చూడండి.

Saturday, November 22, 2014

బి యస్ యన్ యల్ లో జూనియర్ అక్కౌంట్స్ ఆఫీసర్ల నియామకం

బి యస్ యన్ యల్ లో జూనియర్ అక్కౌంట్స్ ఆఫీసర్ల నియామకం.  పూర్తి వివరములకు క్రింది లింక్ ను నొక్కండి

ఇక్కడ నొక్కండి

Sunday, November 2, 2014

దీపావళికి దీపాలను వెలిగంచారని విద్యార్ధులమీద చర్యలు!



భారత దేశం సెక్యులర్ దేశమని గర్వంగా చెప్పుకుంటాము. మనది హిందూ దేశమైనప్పటికీ,  మన దేశ రాజ్యాంగం పౌరులకు తమకు నచ్చిన మతం మరియు మత పరమైన ఆచార వ్యవహరాలు అనుసరించే పూర్తి హక్కునిచ్చింది. అన్య మతస్తులు మైనారిటీలని వారికి అనేక వసతులు కల్పించాము అనేకంటే ఇతర దేశములతో పోల్చితే నెత్తిన పెట్టి చూసుకుంటున్నాము అని చెప్పవచ్పు.  అన్ని మతాలవారిని సమానంగా గౌరవంగా చూస్తున్నాము. అంతవరకూ బాగుంది కాని మరి మన హిందూ మతాన్ని గౌరవించవద్దా? హిందువు లను లక్ష్యంగా ఉగ్రవాద దాడులు జరపడం, మతమార్పిడులకు పూనుకోవడం, మన పవిత్ర దేవాలయాలలో అన్య మత ప్రచారాలు చేయడం చూస్తున్నాము.   తమిళనాడులోని ఒక మెడికల్ కళాశాలలో మొన్న దీపావళికి దీపాలను వెలిగంచారని ఆ విద్యార్ధులమీద చర్యలు తీసుకున్నారు.  రూ.5000/_ అపరాధ రుసుము విధించారు.  సెక్కులర్ దేశమంటే ఇతర మతస్ద్తులను నెత్తిన పెట్టుకోవడమేనా మన హిందూ మతం మీద మమకారం ఉండక్కరలేదా?  ప్రతీ దేశం తమ తమ అస్తిత్వాన్ని కాపాడుకుంటయి తమ జాతి మతములకు ఎంతో పాధాన్యతనిస్తాయి. కాని మనం మనవి వదిలేసుకుని దేనికోసమో పాకులాడుతున్నామనిపిస్తోంది.   మన దేశం, ప్రాంతం, భాష, సంస్కృతి, మతం, ఆచార వ్యవహరాలను వదిలేసి పరులకు పట్టం కడుతున్నాము.     అన్యులు మన మతాచారాలని గౌరవించక పోతే కనీసం స్పందించక పోతే ఎలా? ఇటువంటి చర్యలను అడ్డుకునే చర్యలు తూతూ మంత్రంగా మాత్రమే  జరుగుతున్నాయి.  ఇలా మిన్నకుంటే రాను రాను అవి పెను భూతంగా పరిణమించవచ్చు. మోడి అయినా ఒటు బ్యాంకు రాజకీయాలకు ప్రాకులాడ కుండా  మన దేశానికి పూర్వ వైభవాన్ని తీసుకు వస్తాడని ఆశిద్దాం .

Saturday, November 1, 2014

ఆకాశవాణి నుంచి త్వరలో 24 గంటల వార్తా ప్రసారాల ఛానెల్

ఆకాశవాణి రేడియోలో ఈ మధ్య నరేంద్ర మోడి మన్ కి బాత్ అను కార్యక్రమం ద్వారా ప్రజలనుద్దేశించి ప్రసంగించిన విషయం విదితమే.   నరేంద్ర మోడి మన్ కి బాత్ కార్యక్రమం రేడియో కి మరింత ప్రాచుర్యం కలిగించడమే కాకుండా దేశంలో ని మారు మూల ప్రాంతాలలోకి కూడా తన సందేశాన్ని చేరవేయాలని మోది సంకల్పాన్ని నెరవేర్చింది .    ఈ నెల 2వ తేదిన మరోమారు నరేంద్ర మోడి ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్నారుట.  తన రేడియో కార్యక్రమానికి వచ్చిన స్పందన చూసిన నరేంద్రమోడి, దూరదర్శన్ తరహలో ఆకాశవాణిలో కూడా 24 గంటల వార్తా ప్రసారాల ఛానెల్ ప్రారంభించడాని కి ఆదేశాలు జారీ చేశారుట.  సో మనం త్వరలో కొత్త ఆకాశ వాణి 24 గంటల వార్తా ప్రసారాల ఛానెల్ ను చూడబోతున్నాము కాదు కాదు  వినబోతున్నాము.