Tuesday, March 6, 2012

ఓటర్లను ఆకట్టుకోలేకపోయాము - ఉత్తర్ ప్రదే్శ్ లో ఒటమిపై రాహుల్ వాఖ్య:

ఉత్తర ప్రదేశ్ లో ఓటమికి తాను బాధ్యత వహిస్తున్నట్లు గా మరియు ఓటర్లను ఆకట్టుకో లేకపోయామని రాహుల్
వ్యాఖ్యానించాడు.   టి.వి. లలో ఉదయంనుంచి అనేక విశ్లేషణలు చూస్తున్నాము.  కాని సగటు మాగపుడు తన కేం కావాలో మరోసారి విస్పష్టంగా ప్రకటించాడు.  అదే అవినీతి రహిత పాలన.  జాతీయ పార్టీ అయిన కాంగ్రెసు అసమర్ధపాలన లో సామాన్యుడి పరిస్తితి నానాటికి దిగజారి పోతోంది.  2జి కుంభకోణం, కామన్వెల్త్ క్రీడ ల నిర్వహణ, ధరల అదుపులో వైఫల్యం, పాలనా యంత్రాంగం/అలయన్స్ మీద ప్రధానికి అదుపు లేకపోవడం,  సమర్ధమైన లోక్ పాల్ బిల్ తేలేకపోవడం, నానాటికి పెరుగుతున్న పెట్రోలు ధర మొదలైనవి ఎన్నో పున్నాయి.  ఇకనైనా వీటి పైన శ్రద్ధ చూపకపోతే 2014 లో జరగబోయే ఎన్నికల ఫలితాలు తరువాత కూడా రాహుల్ ఇదే వాఖ్యలు మరోమారు చేయవలిసి ఉంటుంది అనడంలో సందేహం అవసరం లేదు.

No comments:

Post a Comment