Saturday, April 7, 2012

ప్రపంచ ఆరోగ్య దినోత్సవం

"ఆరోగ్యమే మహా భాగ్యం" అన్నది నానుడి.  ఇది అక్షర సత్యం అన్నది నేడు నిరూ పితమవుతున్నది. ప్రజల కోసం ప్రజలచేత నిర్మితమైన మన ప్రభుత్వం "ప్రజారోగ్యాన్ని" గాలికి వదిలేసింది.  లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ లు అని  ఎంతో ఘనంగా చెప్పుకుంటున్నారు.  ప్రజల రక్తం పిండి మరి పన్నులు వాసులు చేస్తున్నారు.  వారి ని మద్యం మత్తు లో ముంచి వారి  ఆరోగ్య "సంపద"ని దోచేస్తున్నారు. కానీ ప్రాధమిక సదుపయాలైన విద్య, వైద్యం, మంచినీటి వసతి మొదలగునవి కల్పించటం లో విఫలమైనాయి.  ఇప్పటికి చాల గ్రామాలలో వైద్య సదుపాయం మృగ్యం.  ఏజన్సీ ప్రానతలైతే చెప్పనవసరం లేదు.  అడవి తల్లి బిడ్డలు దోమ కాటుకి కూడా బలైపోతున్నారు.  ప్రభుత్వ వైద్యశాలలు ని నిర్వీర్యం చేస్తున్నారు మరియు బడా కార్పొరేటు సంస్థలకు తాయిలలిచ్చి మరి మేపుతున్నారు.  నైతిక విలువలు హరించి పోతున్నాయి.  వైద్య వృత్తి కి సంపాదనే పరమావధి గా మారింది.  పాలకులరా కళ్ళు తెరవండి.  ప్రజలు  మిమ్మల్ని ఏమి అడగట్లేదు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు బ్రతకడానికి దారి చూపించండి. వాళ్ళని బిచ్చగాళ్ళని చేయకండి. వారికి కనీస వసతులు (వారి చేతిలో లేనివి ) కలిపించండి చాలు అదే పదివేలు. సర్వే జనా సుఖినోభవంతు.

No comments:

Post a Comment