Saturday, June 2, 2012

ఈ క్రింది పోస్ట్ మీద నాస్పందన.
వాల్లు ఏడుస్తుంటే

మొదటగా వాళ్ళ ఏడుపుకు కారణం స్వయంక్రుతాపరాధం.  అధికారాన్ని అడ్డుగా పెట్టుకుని కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని కొల్ల గొట్టారు.  దానికి ఫలితం అనుభవిస్తున్నారు.

ఇక రాజశేఖర్ రెడ్డిగారు ప్రవేశ పెట్టిన అన్ని schemes ప్రజలకు తాత్కాలిక ప్రయోజనాలను మాత్రమే కలుగ జేస్తాయి, అవి కూడా కొద్ది మంది కి మాత్రమే.  ఆ schemes క్రింద పెట్టిన ఖర్చు వలన private వ్యక్తులు (corporate) మాత్రం బాగా లాభ పడ్డారు.  చాలామంది అర్హత లేని వ్యక్తులు అక్రమ రేషన్ కార్డులు, దొడ్డి దారిలో అవసరమున్న లేకున్నా పధకాల ముసుగులో దోచుకున్నారు.  ఆ సొమ్మును దీర్ఘకాలంగా ప్రయొజనలను ఇచ్చే కళాశాలలు, ఆసుపత్రులు మొదలయిన infrastructure మీద ఖర్చు చేసి వుంటే  వాటి ఫలాలు కొన్ని తరాలు వారు అనుభవించే వారు.  నిజంగా అభివ్రుధ్ధి ఆంటే అది, అంతే కాని ఓట్ల కోసం, తన స్వప్రొయొజనాల కోసం ప్రజల కష్టార్జితాన్ని నీళ్ళ పాలు చేయడం కాదు.  అటువంటి వాల్లు మనకు నాయకులు.  దయచేసి మీ అజ్నానాన్ని వీడండి.  వాల్లు schemes పేరుతో మనల్ని దోచుకుంటున్నారు, వాస్తవాన్ని గ్రహించండి.  చివరగా ఒక్క మాట, ఫలనా వ్యక్తి నిర్మించిన కాలేజీ ఇది అని కొన్ని దశాబ్దాల తరువాత కూడా జనం చెప్పుకుంటారు అంటే చూడండి, అది మనకు తరతరాలు చేకూర్చే ప్రయొజనం.